కోదాడ ,ఏప్రిల్ 6(నేటి తెలుగు పత్రిక): సోమవారం నాడు ఎం శ్రీ జిల్లా పరిషత్ బాలరవన్నత పాఠశాల ఉపాధ్యాయులు కోదాడ పట్టణంలో నయా నగర్, శ్రీనగర్ కాలనీ యందు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలలో ఉన్న మౌలిక వసతులు , సదుపాయాలు కంప్యూటర్ విద్య, పాఠశాలలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలతో కూడిన కరపత్రాలు, ఫ్లెక్సీ తో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు , విద్యార్థులును కలిసి 5వ తరగతి పూర్తి చేసిన తర్వాత 6 వ తరగతికి ప్రభుత్వబడి పి ఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చేర్పించాలని కోరినారు. బడిబాట కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, డి. లింగయ్య, కె. పాండురంగ చారి, సి హెచ్. వేణు కుమార్, సక్రు, శ్రీనగర్ కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు భూపాల్ రెడ్డి , నయా నగర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు హరి ప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

