Breaking News

మైక్రో ఇరిగేషన్‌లో ఏపీ అగ్రస్థానం.. చంద్రబాబు

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: ఎన్. చంద్రబాబు నాయుడు రాష్ట్రం సాగునీటి రంగంలో ముందంజలో ఉందని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా యాడికిలో జరిగిన ‘నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, మైక్రో ఇరిగేషన్‌లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు.ఈ ఏడాది అనంతపురానికి 70 టీఎంసీల నీటిని తరలించామని పేర్కొన్న ఆయన, భవిష్యత్తులో నీటి వనరుల సమర్థ వినియోగమే లక్ష్యమన్నారు. గంగా నుంచి కావేరి వరకు నదుల అనుసంధానం అవసరమని అభిప్రాయపడ్డారు.ఇక కీలక ప్రాజెక్టు పోలవరం పనులపై మాట్లాడుతూ, వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.సాగునీటి విస్తరణతో రైతుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం వెల్లడించారు.

వైఎస్సార్‌, రాజారెడ్డిపై టీడీపీ విమర్శలు.. షర్మిల ఫైర్

స్వర్ణాంధ్ర విజన్-2047పై సీఎం చంద్రబాబు సమీక్ష

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *