ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గించేందుకు కొత్త “ఎడ్యుకేషన్ కిట్” పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే సుమారు 9.5 లక్షల మంది విద్యార్థులు దీని ద్వారా లబ్ధి పొందనున్నారు. ఈ కిట్లో చదువుకు అవసరమైన స్టేషనరీ (పెన్నులు, పెన్సిల్స్, స్కెచ్ పుస్తకాలు, పౌచులు)తో పాటు హాస్టల్ అవసరాల కోసం ప్లేట్, గ్లాస్, స్పూన్, దుప్పట్లు వంటి వస్తువులు అందించబడతాయి. విద్యార్థుల వయస్సు, తరగతి ఆధారంగా బ్యాగ్లను ప్రత్యేకంగా డిజైన్ చేశారు.ప్రతి వస్తువుకు ప్రభుత్వ గుర్తింపు ఉండేలా సెట్ చేయడం, విద్యార్థుల గుర్తింపు కోసం ఐడీ కార్డులు ఇవ్వడం, సరఫరాలో పారదర్శకత కోసం ట్రాకింగ్ వ్యవస్థను అమలు చేయడం వంటి ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి.మొత్తం మీద, ఒకే కిట్లో విద్యార్థుల అన్ని అవసరాలను తీర్చే ఈ పథకం.. విద్యార్థుల భవిష్యత్తు మరియు విద్యా రంగానికి మేలొచ్చే నిర్ణయం అవుతుంది.
