కరీంనగర్, ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా.. వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించారు. అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే (స్థానిక సంస్థలు), లక్ష్మి కిరణ్ (రెవెన్యూ), ఆర్డీవోలు రమేష్ బాబు, మహేశ్వర్ తో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. ప్రజావాణి కి మొత్తం 233 దరఖాస్తులు రాగా.. అత్యధికంగా కరీంనగర్ నగరపాలిక సంస్థ నుంచి 82 వచ్చాయి.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
