Breaking News

మల్లయ్య కుటుంబ సభ్యులను మరోసారి పరామర్శించిన రాష్ట్ర కాపు జెఏసి చైర్మన్ చందు జనార్దన్

మార్కాపురం, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక, (మంగళవారం): గత నెల 20 వ తేదీ హత్యకు గురైన సంకుల మల్లయ్య కుటుంబ సభ్యులను ఏపి కాపు జెఏసి చైర్మన్ చందు జనార్దన్ కాపు సంఘం నాయకులతో కలసి సోమవారం పరామర్శించారు.జనార్దన్ సోమవారం సాయంత్రం ఈడుపూరు గ్రామంలోని మృతుడు మల్లయ్య నివాసాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లయ్య హత్య కేసులో నిందితులను పూర్తి స్థాయిలో పోలీసులు అరెస్టు చెయ్యలేదని ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులకు సహకరిస్తున్న వారిని,కుట్ర లో భాగస్వాము లైనవారిని విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికైనా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి, ఈ కేసులో మిగతా నిందితులను కూడా అరెస్ట్ చేసి శిక్షించాలని రాష్ట్ర కాపు జెఏసి చైర్మన్ చందు జనార్దన్ పోలీసు అధికారులను డిమాండ్ చేశారు.మల్లయ్య హత్య జరిగిన తరువాత రెండో సారి రాష్ట్ర కాపు జే ఏ సి బృందం ఈడుపురు గ్రామం లో మల్లయ్య నివాసానికి రావడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా కాపు సంఘం అధ్యక్షుడు కె. సంజీవ్ కుమార్, బశెట్టి ప్రసాద్,స్థానిక కాపు నాయకులు ఇ.వెంకటేశ్వర్లు, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రపతి ముర్ము గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు

అమరావతి ఇక అధికారిక రాజధాని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *