ఆంధ్రప్రదేశ్, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర రాజధానిగా అమరావతికి అధికారిక చట్టబద్ధత లభించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం అనంతరం కేంద్ర న్యాయశాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.గెజిట్ ప్రకారం, 2024 జూన్ 2 నుంచి అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అధికారికంగా నోటిఫై చేశారు. రాష్ట్ర అసెంబ్లీ మార్చి 28న ఆమోదించిన తీర్మానం ఆధారంగా, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2)లో సవరణలు చేసింది.ఈ సవరణ బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఈ నెల 1, 2 తేదీల్లో చర్చించి మూజువాణి ఓటుతో ఆమోదించాయి. అనంతరం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 111 ప్రకారం రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.దీంతో అమరావతి అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తింపు పొందింది.
