Breaking News

అమరావతికి చట్టబద్ధతపై గెజిట్ విడుదల

ఆంధ్రప్రదేశ్, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర రాజధానిగా అమరావతికి అధికారిక చట్టబద్ధత లభించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం అనంతరం కేంద్ర న్యాయశాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.గెజిట్ ప్రకారం, 2024 జూన్ 2 నుంచి అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అధికారికంగా నోటిఫై చేశారు. రాష్ట్ర అసెంబ్లీ మార్చి 28న ఆమోదించిన తీర్మానం ఆధారంగా, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2)లో సవరణలు చేసింది.ఈ సవరణ బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఈ నెల 1, 2 తేదీల్లో చర్చించి మూజువాణి ఓటుతో ఆమోదించాయి. అనంతరం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 111 ప్రకారం రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.దీంతో అమరావతి అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తింపు పొందింది.

వైఎస్సార్‌, రాజారెడ్డిపై టీడీపీ విమర్శలు.. షర్మిల ఫైర్

స్వర్ణాంధ్ర విజన్-2047పై సీఎం చంద్రబాబు సమీక్ష

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *