Breaking News

రాష్ట్రపతి ముర్ము గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు

రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి వర్యులు శ్రీ కొలుసు పార్థసారథి

వైఎస్సార్‌, రాజారెడ్డిపై టీడీపీ విమర్శలు.. షర్మిల ఫైర్

ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: ఐదున్నర కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అన్ స్టాపబుల్. పార్లమెంటులోని ఉభయసభలు ఏకగ్రీవంగా ఆంధ్రుల రాజధాని అమరావతికి మద్దతుగా నిలిచాయి. నేడు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము గారు అమరావతి బిల్లుపై వేసిన ఆమోద ముద్ర…ప్రతి తెలుగువారి గుండెలపై చెరగని ముద్రగా నిలుస్తుంది. మా రాజధాని అమరావతి అని తెలుగువారంతా గర్వంగా చెప్పుకునేలా చేస్తుంది. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎగతాళికి గురైన తెలుగువారు…ఇకపై ఎవరు అడిగినా మా రాజధాని అమరావతి అని చెప్పుకునే ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇస్తుంది. రాష్ట్రపతి గారు వేసిన ఆమోద ముద్ర…తెలుగు ప్రజలపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి, ప్రేమ, గౌరవానికి చిహ్నంగా నిలుస్తుంది. ఒక తెలుగువాడిగా రాజధాని అమరావతిని శాశ్వతంగా నిలుపుకునే మహత్తరమైన కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఎంతో గర్వంగా ఉంది. తెలుగు ప్రజలంతా నేడు చేయాల్సిన నినాదం ఒక్కటే…..జయహో అమరావతి….జయ జయహో అమరావతి.

స్వర్ణాంధ్ర విజన్-2047పై సీఎం చంద్రబాబు సమీక్ష

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *