న్యూఢిల్లీ, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: దేశంలో LPG సరఫరాపై ఒత్తిడి పెరుగుతున్న వేళ, వలస కార్మికులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఊరటనిచ్చింది. 5 కిలోల ‘ఛోటు’ LPG సిలిండర్ల కేటాయింపును గణనీయంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.అడ్రస్ ప్రూఫ్ లేక గ్యాస్ కనెక్షన్ పొందలేని వలస కార్మికులు ఇకపై కేవలం ఐడీ ప్రూఫ్తోనే ఈ చిన్న సిలిండర్లను సులభంగా పొందగలరు. అవసరమైతే తిరిగి ఇవ్వగల బైబ్యాక్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.ఇటీవలి సరఫరా గణాంకాల ఆధారంగా ఈ అదనపు కోటాను రాష్ట్రాలకు కేటాయించనున్నారు. ఈ సిలిండర్లను ప్రత్యేకంగా వలస కార్మికుల అవసరాలకే వినియోగించాలని కేంద్రం సూచించింది.ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల సహకారంతో సరఫరా కొనసాగుతుందని, బలహీన వర్గాలకు గ్యాస్ కొరత రాకుండా చూడటమే లక్ష్యమని కేంద్రం వెల్లడించింది.
