Breaking News

LPG కొరతలో ఉపశమనం.. వలస కార్మికులకు అదనపు సిలిండర్లు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: దేశంలో LPG సరఫరాపై ఒత్తిడి పెరుగుతున్న వేళ, వలస కార్మికులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఊరటనిచ్చింది. 5 కిలోల ‘ఛోటు’ LPG సిలిండర్ల కేటాయింపును గణనీయంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.అడ్రస్ ప్రూఫ్ లేక గ్యాస్ కనెక్షన్ పొందలేని వలస కార్మికులు ఇకపై కేవలం ఐడీ ప్రూఫ్‌తోనే ఈ చిన్న సిలిండర్లను సులభంగా పొందగలరు. అవసరమైతే తిరిగి ఇవ్వగల బైబ్యాక్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.ఇటీవలి సరఫరా గణాంకాల ఆధారంగా ఈ అదనపు కోటాను రాష్ట్రాలకు కేటాయించనున్నారు. ఈ సిలిండర్లను ప్రత్యేకంగా వలస కార్మికుల అవసరాలకే వినియోగించాలని కేంద్రం సూచించింది.ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల సహకారంతో సరఫరా కొనసాగుతుందని, బలహీన వర్గాలకు గ్యాస్ కొరత రాకుండా చూడటమే లక్ష్యమని కేంద్రం వెల్లడించింది.

నారీ శక్తి వందన సమ్మేళనంలో మోదీ కీలక వ్యాఖ్యలు.. మహిళల ఆశీస్సులే నాకు బలం

పోలింగ్ కేంద్రాల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేయాలంటూ సుప్రీంలో పిల్.. కేంద్రానికి నోటీసులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *