అమరావతి, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంపై జరిగిన దాడి యత్నాన్ని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. మీడియా స్వేచ్ఛను అణగదొక్కడమే వైసీపీ లక్ష్యమని ఆరోపించారు.అమరావతి అంశంపై ప్రశ్నలు లేవనెత్తినందుకే మీడియాను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. తమను విమర్శించే సంస్థలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు.వైసీపీ పాలనలో మీడియాపై ఒత్తిళ్లు, వేధింపులు సాధారణమయ్యాయని, ఇప్పటికీ అదే ధోరణి కొనసాగుతోందన్నారు. రౌడీ మూకలతో మీడియా కార్యాలయాలపైకి వెళ్లడం తీవ్రంగా ఖండించారు.బెదిరింపులు, దాడులతో మీడియాను భయపెట్టే రోజులు ముగిశాయని, ప్రజలు ఇప్పటికే అలాంటి రాజకీయాలకు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు.
