Breaking News

కేరళలో మార్పు ఖాయం: సీఎం రేవంత్ రెడ్డి

కేరళ, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: కేరళ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం పినరాయి విజయన్పై తీవ్ర ఆరోపణలు చేస్తూ, రాష్ట్రంలో మార్పు తప్పదని అన్నారు.2014–23 కాలంలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ, ఆ సమయంలో తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారని గుర్తుచేశారు. ఆ తప్పుల వల్లే తెలంగాణ ప్రజలు మార్పు తీసుకొచ్చారని, అదే విధంగా కేరళలో కూడా జరుగుతుందని వ్యాఖ్యానించారు.విజయన్‌పై ఉన్న గోల్డ్ స్మగ్లింగ్, శబరిమల అంశాలను ప్రస్తావిస్తూ, ఈ కేసుల్లో చర్యలు లేకపోవడంపై ప్రశ్నలు లేవనెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఉన్న అవగాహన వల్లే విజయన్‌పై చర్యలు లేవని ఆరోపించారు. ఇతర నేతలపై ఈడీ కేసులు నమోదు చేస్తున్న కేంద్రం, విజయన్ విషయంలో మౌనం పాటించడం అనుమానాస్పదమని అన్నారు. కేరళ ప్రజలు ఈ విషయాన్ని గమనించి సరైన తీర్పు ఇస్తారని తెలిపారు.

LPG కొరతలో ఉపశమనం.. వలస కార్మికులకు అదనపు సిలిండర్లు

ముత్తాత, నానమ్మలే వామపక్షాలను ఏమి చేయలేకపోయారు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *