Breaking News

బెజవాడ బస్సులో టికెట్ వివాదం.. కండక్టర్‌కు చెంపదెబ్బ

విజయవాడ, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: ఉచిత బస్సు ప్రయాణం మధ్యలో టికెట్ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. విజయవాడలో ఆర్టీసీ బస్సులో మహిళ ఒకరు కండక్టర్‌పై దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది.ఇద్దరు మహిళలు ప్రయాణిస్తుండగా, మూడు ఆధార్ కార్డులు చూపించడంతో కండక్టర్ ప్రశ్నించగా మాటామాటా పెరిగింది. కోపంతో మహిళ కండక్టర్ చెంపపై కొట్టింది.సంఘటనతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పోలీస్ స్టేషన్‌కు తరలించాడు. ఇరు వర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటుండగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.ఈ ఘటనతో మిగతా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటూ గంటల పాటు వేచి ఉండాల్సి వచ్చింది.

తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు తమ్ముళ్లు సంబరాలు…!

అమరావతికి రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్.. నారా లోకేశ్ భావోద్వేగ స్పందన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *