Breaking News

“రాష్ట్రంలో పోలీస్ రాజ్యం”.. రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు ధ్వజమెత్తు

హైదరాబాద్‌, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన రాక్షస పాలనగా మారిందని ఆరోపించారు.పరిగిలో సమస్యలు ఎదుర్కొంటున్న రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకుని అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నెలకొన్నదని విమర్శించారు. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల భూములను లాక్కుంటున్నారని ఆరోపిస్తూ, రైతులను కలవనివ్వకపోవడం దుర్మార్గమని అన్నారు.ప్రతిపక్ష స్వరాన్ని అణగదొక్కే ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి ముప్పని హరీష్ రావు హెచ్చరించారు.

ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, బీఆర్ఎస్‌కు ఉత్తమ్ సవాల్

చెరువుల కబ్జాలపై హైడ్రా దూకుడు.. కోకాపేటలో భారీ కూల్చివేతలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *