ఆంధ్రప్రదేశ్, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర రాజధాని అంశంపై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. అమరావతిని ఏకైక రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.“ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (సవరణ) బిల్లు-2026”కు పార్లమెంటు ఉభయసభలు ఏప్రిల్ 1, 2 తేదీల్లో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. అనంతరం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదంతో అమరావతికి చట్టబద్ధత లభించింది.ఈ గెజిట్ ప్రకారం అమరావతి రాష్ట్రానికి పూర్తి స్థాయి పాలనా, శాసన, న్యాయ రాజధానిగా కొనసాగనుంది. మూడు రాజధానుల ప్రతిపాదనకు ముగింపు పలుకుతూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.అలాగే, సీఆర్డీఏ పరిధిలోని భూములను మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేయడానికి అనుమతులు లభించాయి. నిలిచిపోయిన సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి.ఈ నిర్ణయంతో అమరావతి అభివృద్ధికి ఊపిరి పోసినట్లైందని, పెట్టుబడులు, అంతర్జాతీయ నిధుల రాకకు మార్గం సుగమమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రైతులు తమ దీర్ఘకాల పోరాటానికి ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
