ములుగు, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కాన్వాయ్ ట్రయల్ రన్లో ప్రమాదం చోటుచేసుకుంది. వెంకటాపురం సమీపంలో వేగంగా వెళ్తున్న పోలీసు వాహనం అదుపు తప్పి ముందున్న వాహనాన్ని ఢీకొట్టింది.ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. వెంటనే స్పందించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ట్రయల్ రన్ సందర్భంగా జరిగిన ఈ ఘటనపై అధికారులు అప్రమత్తమై, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలను కట్టుదిట్టం చేస్తామని తెలిపారు. డీజీపీ పర్యటనకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
