Breaking News

అమరావతికి రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్.. నారా లోకేశ్ భావోద్వేగ స్పందన

అమరావతి, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై నెలకొన్న అనిశ్చితికి ముగింపు పలుకుతూ అమరావతికి చట్టబద్ధత లభించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదంతో పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం-2026 అమల్లోకి వచ్చింది.కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో అమరావతి రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అధికారికంగా ఖరారైంది. పార్లమెంటు ఉభయసభలు ఆమోదించిన బిల్లుకు రాష్ట్రపతి సంతకం చేయడంతో ఈ ప్రక్రియ పూర్తయింది.ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ భావోద్వేగంగా స్పందించారు. “రాష్ట్రపతి ఆమోదంతో రాజధాని కల సాకారం అయింది. రాష్ట్ర భవిష్యత్తుకు మద్దతుగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీకి, ఎంపీలకు ధన్యవాదాలు. అమరావతి రైతుల త్యాగాలు చిరస్మరణీయమైనవి” అని ట్వీట్ చేశారు.ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మైలురాయిగా నిలవనుండగా, అమరావతి అభివృద్ధికి కొత్త ఊపిరి లభించనుంది.

వైఎస్సార్‌, రాజారెడ్డిపై టీడీపీ విమర్శలు.. షర్మిల ఫైర్

స్వర్ణాంధ్ర విజన్-2047పై సీఎం చంద్రబాబు సమీక్ష

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *