ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: హర్మూజ్ జలసంధి ఉద్రిక్తతలు ముదురుతున్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగానికి వెనుకాడమని స్పష్టం చేశారు.తనతో పాటు లక్షలాది మంది పౌరులు త్యాగానికి సిద్ధంగా ఉన్నారని వెల్లడిస్తూ, ఇరాన్ వైఖరి ఎంత కఠినంగా ఉందో సంకేతాలు ఇచ్చారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
