Breaking News

“బెంగాల్‌పై కన్నేస్తే మూల్యం చెల్లించాల్సిందే”.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక

న్యూఢిల్లీ, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: పాకిస్థాన్ నేతల వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. బెంగాల్‌ను లక్ష్యంగా చేసుకుంటామని చేసిన హెచ్చరికలను ఆయన ఖండించారు.“భారత్‌పై దాడి చేస్తే తీవ్ర ప్రతిచర్య తప్పదు. బెంగాల్‌పై కన్నేస్తే పాకిస్థాన్‌కు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది” అని స్పష్టం చేశారు.గతంలోనే పాకిస్థాన్ విభజనకు గురైందని గుర్తుచేస్తూ, అలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా జాగ్రత్త పడాలని హెచ్చరించారు.దేశ భద్రత విషయంలో భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడదని, అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

మోదీతో సీఎం విజయ్ భేటీ.. ఢిల్లీ పర్యటనపై ఆసక్తి

మేకెదాటు ప్రాజెక్టుకు బ్రేక్ వేయండి.. మోదీకి విజయ్ లేఖ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *