Breaking News

రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ కీలక భేటీ

విశాఖపట్నం, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: రుషికొండ భవనాల సద్వినియోగంపై రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ 5వ భేటీ జరిగింది. ఈ సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొనగా, మంత్రులు పయ్యావుల కేశవ్, డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వర్చువల్‌గా హాజరయ్యారు.ఈ ఐదు సమావేశాల సారాంశంతో తుది నివేదికను సిద్ధం చేసి, సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర కేబినెట్ ముందుంచనున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు.గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల రుషికొండ ప్యాలెస్ నిర్వహణకే నెలకు సుమారు రూ.25 లక్షలు ఖర్చవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.భవిష్యత్తులో ఈ భవనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా, అలాగే ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మార్చేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

​గ్రామీణాభివృద్ధికి పాడి-పంటలే ఆధారం: పశుసంవర్ధక శాఖ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ టి. దామోదర నాయుడు

అమరావతికి రాజముద్ర.. ఆంధ్రుల కల నెరవేర్చిన చారిత్రాత్మక నిర్ణయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *