Breaking News

రైతులకు గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 15న రైతు భరోసా 2వ విడత

హైదరాబాద్‌, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రైతులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. రైతు భరోసా పథకం రెండో విడత నిధులను ఏప్రిల్ 15న విడుదల చేయనుంది.ఇప్పటికే తొలి విడతలో ఎకరాకు రూ.6,000 చొప్పున నిధులు జమ చేసిన ప్రభుత్వం, ఇప్పుడు మిగిలిన మొత్తాన్ని రెండో విడతగా రైతుల ఖాతాల్లో వేయనుంది.ఈ విడతలో ఒకటి నుంచి ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు లబ్ధి పొందనున్నారు. ఇందుకోసం సుమారు రూ.2,700 కోట్లు విడుదలకు సిద్ధం చేశారు.మూడో విడత నిధులను కూడా ఈ నెలాఖరులోగా విడుదల చేసే అవకాశముందని అధికారులు వెల్లడించారు.

ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, బీఆర్ఎస్‌కు ఉత్తమ్ సవాల్

చెరువుల కబ్జాలపై హైడ్రా దూకుడు.. కోకాపేటలో భారీ కూల్చివేతలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *