Breaking News

ఇంధన సంక్షోభం దెబ్బ.. పాకిస్తాన్‌లో పరిమితులు కఠినం

ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: మధ్యప్రాచ్య యుద్ధ ప్రభావంతో పాకిస్తాన్‌లో ఇంధన సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కఠిన నియంత్రణలు అమలు చేస్తోంది.దేశవ్యాప్తంగా మార్కెట్లు, మాల్స్ రాత్రి 8 గంటలకే మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. రెస్టారెంట్లు, ఫుడ్ ఔట్‌లెట్లు, వివాహ వేడుకలు కూడా సమయ పరిమితిలోనే ముగించాల్సి ఉంటుంది. హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలతో చమురు సరఫరా దెబ్బతినడంతో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఖర్చులను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.ఇందులో భాగంగా నాలుగు రోజుల పని వారం, ప్రభుత్వ ఖర్చుల్లో కోత వంటి నిర్ణయాలు కూడా అమలు దిశగా ఉన్నాయి.ప్రస్తుత పరిస్థితులు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడి పెంచుతున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

మోదీతో సీఎం విజయ్ భేటీ.. ఢిల్లీ పర్యటనపై ఆసక్తి

మేకెదాటు ప్రాజెక్టుకు బ్రేక్ వేయండి.. మోదీకి విజయ్ లేఖ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *