Breaking News

మద్యం మత్తులో వేగం.. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రాణాలు బలి

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లోని హస్తినాపురంలో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మద్యం మత్తులో అతివేగంగా దూసుకొచ్చిన కారు ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను బలిగొట్టింది.అదుపుతప్పిన కారు ముందుగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టి, తర్వాత బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.మృతులు ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ప్రమాదంపై సమాచారం అందుకున్న విద్యార్థులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు.మద్యం సేవించి కారు నడిపిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, బీఆర్ఎస్‌కు ఉత్తమ్ సవాల్

చెరువుల కబ్జాలపై హైడ్రా దూకుడు.. కోకాపేటలో భారీ కూల్చివేతలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *