Breaking News

ఇరాన్‌లో భారతీయులకు అలర్ట్.. వెంటనే దేశం వీడాలని సూచన

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: ఇరాన్‌లో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. అక్కడ ఉన్న భారతీయులు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా దేశం విడిచివెళ్లాలని కోరింది.తెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సరిహద్దుల వైపు వెళ్లవద్దని స్పష్టం చేసింది. రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ప్రయాణాలు చేయాలని సూచించింది.ప్రస్తుతం ఇరాన్‌లో భద్రతా పరిస్థితులు అనిశ్చితంగా ఉండటంతో, భారతీయులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. అవసరం లేని ప్రయాణాలు చేయకుండా, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచనలు జారీ చేసింది.ఇప్పటికే పెద్ద సంఖ్యలో భారతీయులు స్వదేశానికి చేరుకున్నప్పటికీ, ఇంకా అక్కడ ఉన్నవారు త్వరగా తిరిగి రావాలని కేంద్రం పిలుపునిచ్చింది.

మోదీతో సీఎం విజయ్ భేటీ.. ఢిల్లీ పర్యటనపై ఆసక్తి

మేకెదాటు ప్రాజెక్టుకు బ్రేక్ వేయండి.. మోదీకి విజయ్ లేఖ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *