Breaking News

హ్యుందాయ్ కార్ల ధరలు పెంపు.. మే నుంచి అమలు

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రముఖ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. మే నెల నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది.కంపెనీ తెలిపిన ప్రకారం, గరిష్ఠంగా 1 శాతం వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే వాహనం మోడల్‌, వేరియంట్‌ను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయని వెల్లడించింది.తయారీ ఖర్చులు, విడిభాగాల ధరలు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. పెరుగుతున్న వ్యయాలను తట్టుకునేందుకు ధరల పెంపు అవసరమైందని తెలిపింది.ఈ నిర్ణయంతో కొత్త కారు కొనాలనుకునే వారికి అదనపు భారం పడనుంది. ధరలు పెరగకముందే కొనుగోలు చేయాలని పలువురు వినియోగదారులు భావిస్తున్నారు.

సెకన్లలోనే కరెంట్ బిల్లు.. స్మార్ట్ టెక్నాలజీతో విద్యుత్ శాఖ కొత్త విధానం

E20 పెట్రోల్ అమలు.. వాహనదారులకు కీలక సూచనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *