Breaking News

ఏప్రిల్ 8 మా కుటుంబానికి భావోద్వేగ దినం: అన్నా లెజినోవా

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: ఏపీ ఉపముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కుటుంబానికి ఏప్రిల్ 8 ప్రత్యేకమైన రోజు అని ఆయన భార్య అన్నా లెజ్నేవా తెలిపారు. ఆనందం, ఆవేదన కలగలిపిన ఈ రోజు తమ జీవితంలో మరచిపోలేని రోజు అని చెప్పారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ రోజు తమ పెద్ద కుమారుడు అకిరా నందన్ పుట్టినరోజు అని పేర్కొన్నారు. అదే రోజున గత సంవత్సరం తమ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ ప్రమాదం సమయంలో తాము తీవ్ర ఆందోళనకు గురయ్యామని, ఆ క్షణాలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నామని చెప్పారు. అయితే దేవుడి దయతో అతను సురక్షితంగా బయటపడటం తమకు పునర్జన్మలాంటిదని భావోద్వేగంగా తెలిపారు.అదే రోజున అకీరా పుట్టినరోజు రావడం తమకు ఆనందాన్ని కూడా ఇస్తుందని, అతని ఎదుగుదలపై గర్వంగా ఉందన్నారు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో అతను ఎప్పుడూ ముందుంటాడని ప్రశంసించారు.ఈ రోజు ఇద్దరు కుమారుల కోసం ప్రత్యేకంగా వేడుకలు నిర్వహిస్తామని, ఒకవైపు పుట్టినరోజు సంబరాలు, మరోవైపు జీవితాన్ని కృతజ్ఞతతో గుర్తుచేసుకునే రోజు అని అన్నా లెజినోవా తెలిపారు. ఏప్రిల్ 8 తమ కుటుంబానికి నిజంగా ఒక ఎమోషనల్ డే అని పేర్కొన్నారు.

‘జన నాయగన్’తో సమంత మూవీకి టెన్షన్?

బుమ్రాపై కామెంట్.. వెంటనే క్షమాపణ చెప్పిన రామ్ చరణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *