Breaking News

అమరావతిపై జగన్ విమర్శలు.. ‘మావిగన్’ ప్రతిపాదనపై స్పష్టత

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: రాజధాని అంశంపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి స్పందించారు. అమరావతి ప్రాజెక్టు అవినీతి, దోపిడీకి కేంద్రంగా మారిందని ఆయన ఆరోపించారు.చంద్రబాబు నాయుడు అమరావతిని ప్రోత్సహించడంలో ప్రజాహితం కంటే కాంట్రాక్టుల ప్రయోజనాలే ముఖ్యమని జగన్ విమర్శించారు. కమిషన్ల కోసం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు.ఈ నేపథ్యంలో ‘మావిగన్’ పేరుతో తమ ప్రతిపాదనను జగన్ వివరించారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలిపే 110 కిలోమీటర్ల కారిడార్‌ను అభివృద్ధి చేసి సమగ్ర రాజధాని ఏర్పాటు చేయాలనేదే తమ ఉద్దేశమని తెలిపారు.ప్రాంతాల మధ్య సమతుల అభివృద్ధి లక్ష్యంగా ఈ ప్రణాళికను రూపొందించామని జగన్ పేర్కొన్నారు. రాజధాని అంశంపై రాజకీయ వేడి ఇంకా కొనసాగుతోంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అల్యూమినా నాణ్యతను పెంచిన ‘రుసాల్’

రాష్ట్రంలో ఉపాధి సృష్టిపై ఫోకస్.. 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *