ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: భారత్లోని ఘనా హైకమిషనర్ ప్రొఫెసర్ క్వాసి ఒబిరి-డాన్సో, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు. హైకమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన హైదరాబాద్కు రావడం ఇదే మొదటిసారి.ఈ సందర్భంగా ఇరువురూ పరస్పర సంబంధాల బలోపేతంపై చర్చించారు. ముఖ్యంగా విద్య, శాస్త్ర సాంకేతికం, ఆరోగ్యం, వాణిజ్య రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించాలనే అంశంపై దృష్టి సారించారు.ఘనా–తెలంగాణ మధ్య స్నేహ సంబంధాలు మరింత అభివృద్ధి చెందాలని హైకమిషనర్ ఆకాంక్ష వ్యక్తం చేయగా, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

