ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని టాటా లాక్హీడ్ మార్టిన్ ఎయిరోస్ట్రక్చర్స్ సంస్థ ప్రతినిధి టిమ్ రైఫిల్ హైదరాబాద్లో కలిశారు. జూబ్లీహిల్స్లోని నివాసంలో జరిగిన ఈ భేటీలో రక్షణ రంగంలో అవకాశాలపై చర్చించారు.భారతదేశంలో C-130J సూపర్ హెర్క్యులిస్ విమానాల అసెంబ్లీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు లాక్హీడ్ మార్టిన్ వెల్లడించింది. అలాగే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్తో కలిసి F-16 వింగ్స్ తయారీ కొనసాగుతున్నట్లు తెలిపింది.తెలంగాణను డిఫెన్స్ హబ్గా అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయని, ముఖ్యంగా ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ (MRO) రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు టిమ్ రైఫిల్ తెలిపారు.రాష్ట్రంలో పెట్టుబడులకు పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో తెలంగాణలో రక్షణ రంగం మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

