ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్ తన అనుచరులతో కలిసి జాగృతిలో చేరారు. కల్వకుంట్ల కవిత ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, ఏప్రిల్ 25 రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పుకు నాంది పలికే రోజు అవుతుందని అన్నారు. కొత్త తరహా రాజకీయాలతో ప్రజల సమస్యలను ప్రశ్నిస్తూ, పరిష్కార దిశగా కృషి చేస్తామని స్పష్టం చేశారు.రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతు భరోసా, రుణమాఫీ వంటి హామీలు అమలు కాలేదని ఆరోపించారు. చేనేత కార్మికులు, సీడ్ పత్తి రైతులు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.అప్పర్ భద్ర ప్రాజెక్ట్ అంశంపై ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల మహబూబ్నగర్ ప్రాంతానికి నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.జాగృతి తరఫున ప్రజల కోసం పనిచేసే రాజకీయాలను తీసుకువస్తామని, అభివృద్ధి అజెండాతో ముందుకు సాగుతామని కవిత పేర్కొన్నారు. రంజిత్ కుమార్ వంటి నాయకులతో కలిసి ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు.








