ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: పేద ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి సందర్భంగా ఆయన సేవలను నారా లోకేష్ స్మరించారు. అర్ధశతాబ్దం క్రితం తెలుగు నేలపై అడుగుపెట్టి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) స్థాపించి అనంత జిల్లా ప్రజల జీవితాల్లో ఆశాకిరణంగా నిలిచారని పేర్కొన్నారు.ఆసుపత్రులు, పాఠశాలలు, స్వయం సహాయక సంఘాలు, క్రీడామైదానాలు, పేదలకు గృహాల నిర్మాణం వంటి అనేక కార్యక్రమాల ద్వారా ఫెర్రర్ అభివృద్ధికి మార్గదర్శకుడిగా నిలిచారని లోకేష్ గుర్తు చేశారు.ఈ సందర్భంగా ఆర్డీటీ సేవలు అంతరాయం లేకుండా కొనసాగేందుకు కేంద్రం నుంచి FCRA అనుమతులు పొందడంలో తమ ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు. నిస్వార్థ సేవతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్కు నివాళులు అర్పించారు.
