Breaking News

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర అనుమతి.. త్వరలో నిర్మాణానికి మార్గం సుగమం

ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: ఆదిలాబాద్లో కొత్త విమానాశ్రయం ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు.రక్షణ శాఖ పరిధిలో ఉన్న ఎయిర్‌ స్ట్రిప్‌ను అభివృద్ధి చేసి, పౌర విమాన సేవలకు అనుకూలంగా ప్రత్యేక ఎన్‌క్లేవ్ ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న భూమికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని ఎకరాలు కేటాయించాల్సి ఉంటుందని తెలిపారు.ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఎయిర్‌బస్ A320 తరహా పెద్ద విమానాలు కూడా దిగేలా సదుపాయాలు కల్పించనున్నారు. దీంతో ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.ఈ ఎయిర్‌పోర్ట్‌తో ఆదిలాబాద్ ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని, వ్యాపారం, పర్యాటకం విస్తరించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం సమీప విమానాశ్రయాల కోసం దూర ప్రయాణం చేయాల్సిన అవసరం తగ్గనుంది.ఇక రాష్ట్రంలోని ఇతర విమానాశ్రయాల అభివృద్ధిపై కూడా సమీక్ష కొనసాగుతోంది. వరంగల్, పెద్దపల్లి ప్రాంతాల్లో ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నట్లు కేంద్రం తెలిపింది.

జీహెచ్‌ఎంసీ విభజనపై కాంగ్రెస్ సర్కార్‌కు బీజేపీ చీఫ్ రామచందర్‌రావు విమర్శలు

బీజేపీ రైతు యాత్ర బీఆర్ఎస్ కోసమే: వేముల వీరేశం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *