Breaking News

ఎన్‌ఎస్‌యూఐ 56వ ఆవిర్భావ దినోత్సవం.. ఇందిరా భవన్‌లో వేడుకలు

ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: NSUI ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని ఇందిరా భవన్లో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి రాజకీయాలు నాయకత్వానికి పునాది అని తెలిపారు. యువత అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకుని ప్రజలకు సేవ చేయాలని సూచించారు. ఎన్‌ఎస్‌యూఐ నుంచి ఎదిగిన నాయకులు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ప్రజల మధ్య ఉండి సమస్యలను అర్థం చేసుకోవడం ద్వారా మంచి నాయకులుగా ఎదగవచ్చని అన్నారు.విద్యార్థి నాయకులు ఓపిక, క్రమశిక్షణతో ముందుకు సాగాలని, బాధ్యతతో రాజకీయాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

విద్యతోనే భవిష్యత్‌ నిర్మాణం.. భట్టి విక్రమార్క పిలుపు

జీవన్ రెడ్డి వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ వైపు అడుగులా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *