Breaking News

జగన్‌పై అచ్చెన్నాయుడు తీవ్ర ఆరోపణలు

ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చోటుచేసుకున్నాయి. టీడీపీ సీనియర్ నేత కింజరాపు అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మృతి చెందిన సమయంలో జగన్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఆ సమయంలో ఇతర రాష్ట్రాల్లో ఉండాల్సిన అవసరం ఏమిటని సందేహం వ్యక్తం చేశారు.వైఎస్సార్ కనిపించడం లేదని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నెలకొన్న సమయంలో సీఎం పదవిపై సంతకాల సేకరణ జరిగిందా అని అచ్చెన్నాయుడు ఆరోపించారు. వైఎస్సార్ మృతి వెనుక జగన్ హస్తం ఉందని గతంలో బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారని పేర్కొన్నారు.తెలుగు ప్రజలపై జగన్‌కు ఎందుకు కక్ష ఉందని ప్రశ్నించిన ఆయన, రాష్ట్రంలోని వ్యవస్థలను జగన్ భ్రష్టు పట్టించారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

మోదీ అనుబంధంపై ‘అప్నాపన్’ పుస్తకం ఆవిష్కరణ.. కార్యక్రమంలో పాల్గొన్న లోకేశ్

గిన్నిస్ రికార్డు లక్ష్యంగా టీడీపీ మహానాడు: పల్లా శ్రీనివాసరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *