ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: మహిళా రిజర్వేషన్ల బిల్లుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. మహిళా కోటా అమలులో ఓబీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా తీసుకున్న నిర్ణయం అన్యాయమని ఆమె అన్నారు.జనగణనలో ఓబీసీ గణన నిర్వహించి, ఆ ఆధారంగా మహిళా కోటాలో సబ్ కోటా కల్పించాలని కవిత డిమాండ్ చేశారు. పాత జనాభా లెక్కలను ఆధారంగా తీసుకోవడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు.మహిళా బిల్లుపై పార్లమెంట్లో చర్చకు ముందే డ్రాఫ్ట్ను అన్ని పార్టీలకు ఇవ్వాలని, లేకపోతే ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు.మహిళలకు న్యాయం జరిగేలా అన్ని పార్టీలు ఏకమై పోరాటం చేయాలని కవిత పిలుపునిచ్చారు.
