Breaking News

పిల్లలను సోషల్ మీడియా నుంచి దూరంగా ఉంచేందుకు చట్టం: మంత్రి నారా లోకేష్

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో చిన్నపిల్లలను సోషల్ మీడియా ప్రభావం నుంచి దూరంగా ఉంచేందుకు విధివిధానాలు, చట్టరూపకల్పనపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ అంశంపై ఉండవల్లి నివాసంలో మంత్రుల బృందం, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ప్రతినిధులు, అధికారులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, పిల్లల సృజనాత్మకత దెబ్బతినకుండా సోషల్ మీడియాకు దూరంగా ఉంచేలా ప్రత్యేక చట్టం రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.సోషల్ మీడియాలో విద్వేష వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో మంత్రులు వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, ఇతర ఉన్నతాధికారులు, సైబర్ క్రైమ్ అధికారులు మరియు సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

కాళేశ్వరం మరమ్మతులకు వేగం – సీఎం ఆదేశాలు

ఘనంగా సీనియర్ జర్నలిస్ట్ సత్య జన్మదిన వేడుకలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *