ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్ ప్రకటించింది. కరువు భత్యం (డీఏ)ను 2.1 శాతం పెంచుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దీంతో డీఏ 50.7 శాతం నుంచి 52.8 శాతానికి పెరిగింది.పెరిగిన డీఏను 2026 జనవరి 1 నుంచి అమలు చేయనున్నట్లు వెల్లడించారు. జనవరి నుంచి రావాల్సిన బకాయిలను మూడు నెలల్లో విడతల వారీగా చెల్లిస్తామని తెలిపారు.ఈ పెంపుతో ఆర్టీసీపై నెలకు సుమారు రూ.2.82 కోట్ల అదనపు భారం పడనుంది. అయినప్పటికీ ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.డీఏ పెంపుపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆర్టీసీ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు.
