Breaking News

టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ పెంపు

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ ప్రకటించింది. కరువు భత్యం (డీఏ)ను 2.1 శాతం పెంచుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దీంతో డీఏ 50.7 శాతం నుంచి 52.8 శాతానికి పెరిగింది.పెరిగిన డీఏను 2026 జనవరి 1 నుంచి అమలు చేయనున్నట్లు వెల్లడించారు. జనవరి నుంచి రావాల్సిన బకాయిలను మూడు నెలల్లో విడతల వారీగా చెల్లిస్తామని తెలిపారు.ఈ పెంపుతో ఆర్టీసీపై నెలకు సుమారు రూ.2.82 కోట్ల అదనపు భారం పడనుంది. అయినప్పటికీ ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.డీఏ పెంపుపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆర్టీసీ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు.

పోచారం ఐటీ కారిడార్‌లో విషాదం.. యువతి ఆత్మహత్య, ప్రియుడు పోలీసుల అదుపులో

గాంధీ భవన్‌లో కాంగ్రెస్ సమావేశం – కమిటీ నియామకాలపై కీలక నిర్ణయాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *