ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియ వేగం పుంజుకుంది. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో ఇవాళ సుమారు 30 మంది మావోయిస్టులు లొంగిపోనున్నారు.పోలీసుల కట్టుదిట్టమైన చర్యలు, అడవుల్లో గాలింపు ఆపరేషన్లు, సాంకేతిక నిఘా పెంపుతో మావోయిస్టుల కార్యకలాపాలు గణనీయంగా తగ్గినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లోనే పలువురు మావోయిస్టులు సాధారణ జీవితంలోకి రావడానికి ముందుకు వస్తున్నారు.లొంగుబాటు చేసే మావోయిస్టుల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. వారిలో కీలక నేతలు ఉన్నారా అన్న దానిపై ఆసక్తి నెలకొంది.ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస పథకాలు కూడా లొంగుబాటుకు ప్రధాన కారణంగా మారాయి. ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాలు, నివాస సదుపాయాలతో వారిని సమాజంలో స్థిరపడేలా చర్యలు తీసుకుంటున్నారు.హింసకు బదులుగా శాంతి మార్గాన్ని ఎంచుకోవాలని మావోయిస్టులు ముందుకు రావడం పట్ల ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు.
