పల్లాకి మంత్రి పదవి? చంద్రబాబు సర్కార్లో మార్పులు కలకలం
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కు మంత్రి పదవి దక్కనున్నట్లు సమాచారం. నాగబాబు తో పాటు పల్లా శ్రీనివాసరావును కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం నిబంధనల ప్రకారం 25 మంది మంత్రులు ఉంటారని, ఇద్దరిని మంత్రివర్గంలో చేర్చేందుకు ఒక మంత్రిపై వేటు వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా సరిగా పనిచేయని మంత్రులపై చర్యలు తీసుకుని, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలిసింది.
మరోవైపు, ఇతర వ్యవహారాల్లో జోక్యం చేసుకునే మంత్రులను మార్చే అంశంపై కూడా చంద్రబాబు సీరియస్గా ఉన్నట్లు సమాచారం. పల్లా శ్రీనివాసరావు చేరికతో మంత్రివర్గంలో మార్పులు తప్పవని విశ్లేషకులు భావిస్తున్నారు.
