Breaking News

మోదీపై కుట్ర కేసు.. బీహార్‌లో ముగ్గురు అరెస్ట్, దర్యాప్తు కొనసాగుతోంది

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: బీహార్‌లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై హత్య కుట్రకు సంబంధించిన ప్రణాళికను పోలీసులు భగ్నం చేశారు. ఈ కేసులో 22 ఏళ్ల అమన్ తివారీతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.పోలీసుల సమాచారం ప్రకారం, నిందితుడు అమన్ తివారీ అనుమానాస్పద కార్యకలాపాల కారణంగా నిఘా సంస్థల దృష్టిలోకి వచ్చాడు. అతను విదేశీ సంస్థలతో సంప్రదింపులు జరిపి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ప్రతిపాదనలు పంపినట్లు దర్యాప్తులో వెల్లడైంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు స్థానిక పోలీసులకు సమాచారం అందించాయి.దీంతో బక్సర్ జిల్లాలోని అతని నివాసంపై పోలీసులు దాడి చేసి అమన్ తివారీని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న సమాచారంతో మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. భద్రతా కారణాల దృష్ట్యా వారి పేర్లను గోప్యంగా ఉంచినట్లు తెలిపారు.సోదాల సమయంలో ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లు సహా పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించి కీలక ఆధారాల కోసం పరిశీలిస్తున్నారు.దర్యాప్తులో అమన్ తివారీకి గతంలోనూ నేర చరిత్ర ఉన్నట్లు వెల్లడైంది. 2022లో కోల్‌కతా విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని కుట్రకు పాల్పడిన కేసు కూడా అతనిపై ఉందని అధికారులు తెలిపారు.ఈ కేసును సైబర్ కోణంలోనూ, అంతర్జాతీయ సంబంధాల కోణంలోనూ లోతుగా విచారిస్తున్నట్లు భద్రతా వర్గాలు పేర్కొన్నాయి. ఇది ఒంటరిగా చేసిన చర్యా లేక పెద్ద నెట్‌వర్క్ భాగమా అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.దేశ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో ఈ కేసును అత్యంత సీరియస్‌గా తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

నేరస్తులకు కఠిన శిక్షలు తప్పవు: సీఎం విజయ్

రామ్మోహన్ నాయుడు పిల్లలతో మోదీ సందడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *