ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాకిస్తాన్పై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్న పాకిస్తాన్, తన దేశానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పార్లమెంట్లో తీర్మానం చేయడం దుర్మార్గమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం వీడియో సందేశాన్ని విడుదల చేశారు.భారత్పై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు హాఫీజ్ సయ్యద్, మసూద్ అజార్ల వంటి వారికి కూడా భవిష్యత్తులో నోబెల్ బహుమతి ఇవ్వాలని పాకిస్తాన్ అడిగే పరిస్థితి రావచ్చని కవిత విమర్శించారు. ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పించే దేశానికి చెందిన వ్యక్తులు నోబెల్ ప్రైజ్కు అర్హులుగా నిలవడం భారతదేశానికి అవమానకరమని ఆమె పేర్కొన్నారు.పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలు, ఉగ్రవాద సంబంధాలను ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందని ఆమె అన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికల ద్వారా ఈ విషయాలను నోబెల్ కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని ప్రజలకు పిలుపునిచ్చారు
