విపక్షాల ఆందోళనల మధ్య మూడు కీలక బిల్లులకు ఆమోదం
హైదరాబాద్, డిసెంబర్ 17:
తెలంగాణ శాసనసభలో విపక్షాల నిరసనలు కొనసాగుతున్నా.. సభ మూడు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. లగచర్ల రైతుల ఘటనపై చర్చించాలని బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు పట్టుబట్టగా, వాయిదా తీర్మానాల డిమాండ్ చేశారు.
అయితే, ఈ నిరసనల మధ్య మూడు ముఖ్యమైన బిల్లులను ఆమోదించారు.
- స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లు: మంత్రి కొండా సురేఖ ప్రవేశపెట్టగా, వెంటనే సభ ఆమోదం తెలిపింది.
- తెలంగాణ యూనివర్సిటీ సవరణ బిల్లు: మంత్రి దామోదర రాజనర్సింహ సభలో ప్రవేశపెట్టగా, చర్చ లేకుండానే ఆమోదం పొందింది.
- జీఎస్టీ సవరణ బిల్లు: మంత్రి శ్రీధర్బాబు ప్రవేశపెట్టారు.
బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల నడుమ ఈ బిల్లులకు ఆమోదం లభించింది. అనంతరం టూరిజం పాలసీపై స్వల్పకాలిక చర్చ అనంతరం, సభను బుధవారానికి వాయిదా వేశారు.
