Breaking News

Approval for three key bills between disaster concerns

విపక్షాల ఆందోళనల మధ్య మూడు కీలక బిల్లులకు ఆమోదం

విపక్షాల ఆందోళనల మధ్య మూడు కీలక బిల్లులకు ఆమోదం

హైదరాబాద్, డిసెంబర్ 17:
తెలంగాణ శాసనసభలో విపక్షాల నిరసనలు కొనసాగుతున్నా.. సభ మూడు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. లగచర్ల రైతుల ఘటనపై చర్చించాలని బీఆర్‌ఎస్‌, బీజేపీ సభ్యులు పట్టుబట్టగా, వాయిదా తీర్మానాల డిమాండ్ చేశారు.

తాసిల్దార్ కు సన్మానం.

అయితే, ఈ నిరసనల మధ్య మూడు ముఖ్యమైన బిల్లులను ఆమోదించారు.

  1. స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లు: మంత్రి కొండా సురేఖ ప్రవేశపెట్టగా, వెంటనే సభ ఆమోదం తెలిపింది.
  2. తెలంగాణ యూనివర్సిటీ సవరణ బిల్లు: మంత్రి దామోదర రాజనర్సింహ సభలో ప్రవేశపెట్టగా, చర్చ లేకుండానే ఆమోదం పొందింది.
  3. జీఎస్టీ సవరణ బిల్లు: మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టారు.

బీఆర్ఎస్‌, బీజేపీ సభ్యుల నిరసనల నడుమ ఈ బిల్లులకు ఆమోదం లభించింది. అనంతరం టూరిజం పాలసీపై స్వల్పకాలిక చర్చ అనంతరం, సభను బుధవారానికి వాయిదా వేశారు.

రేషన్ కార్డులపై కత్తి.. తెలంగాణలో 1.40 లక్షల కార్డులు రద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *