పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్ పై కఠిన చర్యలు: మంత్రి నాదెండ్ల మనోహర్
పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్ చేసేవారికి కనీసం 6 నెలల జైలు శిక్ష తప్పదని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు పీడీ యాక్ట్ కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
“ఏ పోర్ట్ అయినా, ఏ కంటైనర్ అయినా, ఏ లారీ అయినా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరగడం గుర్తిస్తే, అందుకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని మంత్రి స్పష్టం చేశారు. అక్రమ రవాణాను పూర్తిగా నియంత్రించేందుకు ప్రభుత్వం కఠిన చట్టాలను అమలు చేస్తుందని ఆయన అన్నారు.
