ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో హైడ్రా అధికారులు భారీ కూల్చివేతలు చేపట్టారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించిన అనధికార భవనాలను లక్ష్యంగా చేసుకుని ఈ చర్యలు నిర్వహించారు.పెద్ద సంఖ్యలో సిబ్బంది, పోలీసు బలగాల మధ్య జేసీబీలు, బుల్డోజర్లతో ఆరు అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేశారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన మరికొన్ని నిర్మాణాలపైనా చర్యలు కొనసాగించారు.ఇక కిష్టారెడ్డిపేటలోని అపార్ట్మెంట్లను కూడా ఖాళీ చేయించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇళ్లను ఖాళీ చేయించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం అక్రమ కబ్జాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని స్పష్టం చేసింది.
