ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ సమాజానికి చేసిన కృషిని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి కూడా పాల్గొని పూలేకు నివాళులు అర్పించారు.

