ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. నాగర్కర్నూల్లో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన క్రిటికల్ కేర్ బ్లాక్తో పాటు కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు.అత్యవసర పరిస్థితుల్లో నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా జిల్లాల స్థాయిలోనే మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని మంత్రి చెప్పారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను విస్తరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడం, డాక్టర్లు మరియు నర్సుల ఖాళీలను భర్తీ చేయడం ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తామని తెలిపారు. ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమని మంత్రి పేర్కొన్నారు.
