పామర్రు ఏప్రిల్ 11(నేటి తెలుగు పత్రిక ): నియోజకవర్గ కేంద్రమైన పామర్రు పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జనగణన శిక్షణా తరగతుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులు, సిబ్బందికి జనగణన విధానం, డేటా సేకరణ పద్ధతులు, గృహాల నమోదు వంటి అంశాలపై వివరంగా అవగాహన కల్పించారు.ఈ శిక్షణ ద్వారా అధికారులు మరియు సిబ్బంది తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన మార్గదర్శకాలు అందించబడుతున్నాయి.మాస్టర్ ట్రైనీల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన విధి విధానాలపై ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు జరుగు తున్న మొదటి బ్యాచ్ కి మూడో రోజు శిక్షణలో భాగంగా శని వారం ఎన్యూమరేటర్లు (సచివాల య సిబ్బంది), సూపర్వైజర్లుగా (మండల అధికారులు, సీనియర్ అసిస్టెంట్)లను నియమింప బడిన వారు ఏప్రిల్ 16 నుంచి 30వ తేదీ వరకు స్వీయగణన జరుప వలసి ఉంటుందన్నారు. ఇంటి యజమానే యాప్లోకి వెళ్లి వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఎన్యూమరేటర్లు విధిగా ఆ ఇంటిని సందర్శించినప్పుడు ఐడీని ప్రజలు కు అందించాల్సి ఉంటుంది.మే ఒకటో తేదీ నుంచి 30వ తేదీ వరకు ఇళ్ల జాబితా, ఇళ్ల గణన చేపడతారు. జరగబోయే జనాభా గణనలోకి ప్రజలు భాగ స్వామ్యులు కావాలని, మీ ఇళ్ల వివరాలను సక్రమంగా ఇవ్వాలని, వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్ విభాగం ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుంది.క్షేత్రస్థాయిలో పలు గృహాలకు వెళ్లి సూపర్వైజర్ల పర్యవేక్షణలో ఏన్యూ మురేటర్లు జనగణన డేటాను సేకరించడం జరిగింది.
