ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో మంత్రులు సవిత, అనగాని సత్యప్రసాద్తో పాటు పలువురు కార్పొరేషన్ ఛైర్మన్లు, బీసీ నేతలు పాల్గొన్నారు. పూలే ఆశయాలను స్మరించుకుంటూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సీఎం పిలుపునిచ్చారు. సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణ కోసం మహాత్మా పూలే చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ ఆయన ఆశయ సాధనకు కట్టుబడి పనిచేయాలని నాయకులకు సూచించారు.




