Breaking News

మహాత్మా పూలే జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళి

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో మంత్రులు సవిత, అనగాని సత్యప్రసాద్‌తో పాటు పలువురు కార్పొరేషన్ ఛైర్మన్లు, బీసీ నేతలు పాల్గొన్నారు. పూలే ఆశయాలను స్మరించుకుంటూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సీఎం పిలుపునిచ్చారు. సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణ కోసం మహాత్మా పూలే చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ ఆయన ఆశయ సాధనకు కట్టుబడి పనిచేయాలని నాయకులకు సూచించారు.

పల్నాడులో ఏఎస్సైపై సంచలన ఆరోపణలు.. బ్లాక్‌మెయిల్ వ్యవహారం వెలుగులోకి

పూలే ఆశయ సాధనకు టిడిపి కృషి చేస్తుంది..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *