ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్లోని 87 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లలో డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం మొత్తం వార్డులు, డివిజన్లు 3,206 ఉండగా, 2011 జనాభా లెక్కల ఆధారంగా ఇవి మరో 736 పెరిగే అవకాశముంది. దీంతో మొత్తం సంఖ్య 3,942కి చేరనుంది.ఈ ప్రక్రియ పూర్తయ్యిన తర్వాత ఆగస్టు లేదా సెప్టెంబర్లో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) యోచిస్తోంది. అలాగే, ఇంకా 23 పట్టణ స్థానిక సంస్థల్లో కోర్టు కేసులు పరిష్కారం అయిన తర్వాత ఎన్నికలు నిర్వహించనున్నారు.
