ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ సేవలను పూర్తిగా ఆన్లైన్లోకి తీసుకురావడానికి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఫేస్లెస్ విధానాన్ని అమలు చేయడానికి చర్యలు చేపట్టింది.నెక్ట్స్ జెన్ ఎం-పరివాహన్ ప్లాట్ఫామ్ ద్వారా లైసెన్స్కు సంబంధించిన అన్ని సేవలను ఒకే చోట అందుబాటులోకి తీసుకురానుంది. లైసెన్స్ రీన్యువల్, డూప్లికేట్ లైసెన్స్, అడ్రస్ మార్పు, పేరు సవరణ, పుట్టిన తేదీ అప్డేట్, లెర్నర్ లైసెన్స్, కండక్టర్ లైసెన్స్ వంటి సేవలు సులభంగా ఆన్లైన్లో పూర్తి చేయవచ్చు.ఇక స్లాట్ బుకింగ్ విధానాన్ని కూడా రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మార్పులతో అవినీతి తగ్గడమే కాకుండా ప్రజల సమయం, ఖర్చు కూడా ఆదా అవుతాయి.
