ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వర్గాలను కుదిపేసే ఘటన వెలుగులోకి వచ్చింది. గుంటూరుకు చెందిన ఏఎస్ఐ శ్రీనివాసరావు విధుల్లో ఉండి దుర్వినియోగానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి.మాచర్లలో పనిచేస్తూ ఏకాంతంగా ఉన్న జంటలను లక్ష్యంగా చేసుకుని వారి వీడియోలు తీయించి, తరువాత బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో బయటకు రావడంతో అతని అక్రమాలు బహిర్గతమయ్యాయి.ఇక గతంలో కూడా అతని పై పలు ఆరోపణలు ఉన్నాయి. మైనర్ బాలికను వేధించిన కేసులో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఏఎస్ఐపై సస్పెన్షన్ విధించారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
