Breaking News

మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 27వ వర్థంతి.. సీఎం రేవంత్ రెడ్డి నివాళి

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 27వ వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన నాయకుడిగా శ్రీపాదరావు సేవలు గుర్తుండిపోతాయని అన్నారు. సర్పంచ్ స్థాయి నుంచి స్పీకర్ వరకు వివిధ పదవుల్లో పని చేసి ప్రజాసేవలో తనదైన ముద్ర వేసిన నాయకుడిగా ఆయనను కొనియాడారు.శాసనసభ గౌరవాన్ని పెంపొందిస్తూ సభను హుందాగా నడిపిన తీరు ఆదర్శనీయమని సీఎం పేర్కొన్నారు. ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు.ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పాల్గొన్నారు.

పారదర్శకంగా కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పంపిణీ.. ప్రజా పాలనపై ప్రభుత్వ దృష్టి

దేవాలయాల్లో అన్ని వర్గాలకు అవకాశం ఇవ్వాలి.. గర్భగుడి ప్రవేశంపై మంద కృష్ణ డిమాండ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *